Search This Blog

Tuesday, July 31, 2018

శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు

శుభోదయం!

ఆయన నడిచే వేదాలసారము... ఈ భూలోకానికి భగవంతుడి గురించి చెప్పి జనాలని సన్మార్గంలో పెట్టడానికి అవతరించిన "శుకమహర్షి " .. ఆయనే ప్రవచన పితామహులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు!  వారు వేదాలకే నెలవైన కుటుంబంలో ఆగస్ట్ 28,  1925 న జన్మించారు . వారి తండ్రి గారి పేరు శ్రీదక్షిణామూర్తి గారు. వారి విద్యాభ్యాసం వారి తాతగారైన శ్రీ రామకృష్ణ విద్వత్ చేనుల గారి వద్దే సాగింది. శ్రీ రామకృష్ణ విద్వత్ చేనులు గారు బహుభాషా పండితులు. చంద్రశేఖర శాస్త్రి గారికి తెలుగు సంస్కృత భాషలలో తర్ఫీదు ఇచ్చినది వారి తాతగారే! వారి తాతగారి అభిలాషమెరకే శ్రీచంద్రశేఖర శాస్త్రి గారు ప్రవచనాలు చేయసాగారు.

శ్రీచంద్రశేఖ్ర శాస్త్రి గారికి తిరుమల తిరుపతి దేవస్తానం వారు బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యతగా నియమించారు. భధ్రాచలంలో ప్రతి ఏటా జరిగే సీతా రామ కల్యాణం మాత్రం ఎవరూ మరచిపోని విధంగా వారు వ్యాఖ్యానించారు. "అమ్మా! సీతమ్మ.. కాస్త తల పైకెత్తి రాములు వారి వంక చూడమ్మా " అని వారు వ్యాఖ్యానించిన తీరు జనకమహారాజుని గుర్తు చేస్తుంది. వారు మన సమకాలికులు కావడం మన అదృష్టము. 

ఇప్పటికి వారు చేసిన ప్రవచనాలు వందలు దాటే ఉంటాయి. ఎన్ని ప్రవచనాలు చేసినా "పలికెడిది రామభద్రుండట " అని అంతా ఆ రామకృపగా భావించే భక్తాగ్రేసరులు శ్రీచంద్రశేఖర శాస్త్రులు గారు! వారితో నాకు లభించిన ఈ ఇంటర్వ్యూ వారి వినయానికి దర్పనం. నా మహద్భాగ్యం. 

గంగవెల్లువని చిన్న కమండలలో పట్టి తేవాలన్న నా అత్యాశకు మన్నించండి. కొన్ని కారణాలవల్ల వారు మొదట విడియో ఇంటర్వ్యూ ఇవ్వలేదు. వారు సతిమణి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. నా ఈ ప్రయత్నాన్ని పెద్దమనస్సుతో ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. నచ్చితే పొగడ్తలు శ్రీచంద్రశేఖర శాస్త్రులు గారికి, నచ్చకపోతే తిట్లు నాకు !!  

 

 

 

No comments:

Post a Comment