Search This Blog

Showing posts with label వోలేటి పార్వతీశం. Show all posts
Showing posts with label వోలేటి పార్వతీశం. Show all posts

Sunday, December 3, 2017

వోలేటి పార్వతీశం

వోలేటి పార్వతీశం గారు... ఒక గొప్ప రచయిత, వ్యక్త, నిగర్వి, సాహితీవేత్త, పరిశోధకుడు, అన్నిటినీ మించి... ఒక మంచి వ్యక్తి! దూరదర్శన్ లో 'జాబులు - జవాబులు " లో తనదైన ఒక ముద్ర వేసుకొన్న వారు. వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన వోలేటి పార్వతీశం గారి మనువడు. విద్వత్కవి శ్రీ కందుకూరి రామభద్రరావు గారి దౌహిత్రుడు. సుప్రసిద్ధ గేయకవి "శశాంక  గారి " తనయుడు. ఇవి వారికి జన్మతహ లభించిన అదృష్టాలు.  

 

 

వారిది శ్రవణ సుభగమైన కంఠస్వరం. ఎన్నో అర్హతలు కలిగినా ఏమాత్రమూ అహం లేని గొప్ప వ్యక్తి వారు. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు ప్రసారమాధమానికి సేవలందించారు. గంభీర గళంతో, స్వచ్ఛమైన భాషణంతో, అచ్చమైన భావంతో, అందమైన లాస్యంతో తెలుగు భాషకే వన్నె తెచ్చిన నిలువెత్తు తెలుగు సంతకం... వోలేటి గారు!!

ఏమాత్రము గర్వమూ, అతిశయోక్తి లేకుండా వారి గురించి తెలుసుకోడానికి వెళ్ళిన నాతో వారి జీవిత విశేషాలు చెప్పారు.
ఇప్పటికీ ఎన్నో సాహితీ సభలకు అధ్యక్షత వహించి ఎంతో సాహితీ సేవ చేస్తున్న 'మహానుభావులు"  !!    ఆ మహానుభావుడి ద్వారా విన్న ఆయన జీవిత విషయాలు మీతో పంచుకుంటున్నాను.